కన్నడ వచనం
ಎನಗಿಂತ ಕಿರಿಯರಿಲ್ಲ!
ಶಿವಭಕ್ತರಿಗಿಂತ ಹಿರಿಯರಿಲ್ಲ.
ನಿಮ್ಮ ಪಾದ ಸಾಕ್ಷಿ ಎನ್ನ ಮನ ಸಾಕ್ಷಿ!
ಕೂಡಲಸಂಗಮದೇವಾ ಎನಗಿದೇ ದಿಬ್ಯ.
తెలుగు లిపిలో
ఎనగింత కిరియరిల్ల, శివభక్తరిగింత హిరియరిల్ల!
నిమ్మ పాద సాక్షి, ఎన్న మన సాక్షి
కూడలసంగమదేవా ఎనగిదే దిబ్య.
తెలుగు వచనం
నాకన్నా అల్పులు లేరు, శివభక్తుల మించు శ్రేష్ఠులు లేరు!
నీ పాద సాక్షి , నా మనస్సు సాక్షి
కూడలసంగమదేవా నాకిదే దివ్యం!
వచనకర్త ఆంతర్యం:
శివభక్తుల ముందు నా స్థానం చాలా చిన్నదని తలచి శరణు-శరణార్థి అని పలకాలి. అవి కేవలం వాడుక పదములేగాక శివచరణార్పితమైన మనస్సాక్షిగా నమ్మిన మాటలు, చేసే ప్రమాణం. అటువంటి విశ్వాసమే నాకు దివ్యపదం.
విశ్లేషణ:
ఈ చిన్న వచనంలో భక్తుడు తన మనస్సును నిర్దేశించుకోవడాన్ని, ఇతరులతో వ్యవహరించే విధానాన్ని చెబుతోంది.
వీరశైవులు పాటించే ఆచారాలలో భృత్యాచారం ఒకటి. బసవన్నఈ ఆచారాన్ని తన జీవన శైలిలో జీర్నింపజేసి చూపిన ఘటనలు అతని చరిత్రలో చాలా కనిపిస్తాయి. అయితే భృత్యాచారాన్ని పాటించేవాడు ఆలోచించే విధానన్ని ఈ వచనం స్పష్టంగా చుపెడతోంది. ఇది బసవన్న తనకు తాను వ్రాసుకున్న వచనంగా అగుపిస్తోంది.
సాధారణంగా నేను ఇతరులకంటే గొప్పవాన్ని కావాలనే తాపత్రయం ప్రతివానికి మానసికంగా అలవాటు పడి ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఇతరులతో పోటీపడి జగడాలుపడుతూ ఉంటారు. ఈ కాలములో చదువులో, ఆటలలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, అన్నింటిలో పోటీలు అధికమైనాయి. అయితే ఈ పోటీలు ఆరోగ్యకరమైతే ఫరవాలేదు. చాలా సందర్భాలలో నేను "ఇతరులకంటే గొప్పవాణ్ణి అనిపించుకోవాలనే" అలోచన, చుట్టూ ఉండే వాతావరణాన్ని మార్చి మనస్పర్ధలకు, అనవసర తగవులకు దారి తీస్తాయి. కొన్ని సార్లు ప్రత్యక్షంగా కనబడతాయి. కొన్నిసార్లు పరోక్షంగా మనకు తెలియకుండానే మనస్సును తొలుస్తూ ఉంటాయి.
ఈ వ్యవహారం వ్యక్తులకే గాక సమాజాలకు, జాతులకు, దేశాలకూ వర్తిస్తాయి. ఉదాహరణకు కొన్ని దేశాలు తమ ఆధిక్యాన్ని చాటుకోవడానికి పరోక్షయుద్ధం (cold war) లో చాలాకాలం ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా తమ మతం ఇతరుల మతం కన్నా గొప్పదన్న భావంతో హింసకు పాల్పడుతున్న వారిని చూస్తున్నాము.
ఈ విషయాన్నీ కొంచం పరిశీలిస్తే, ఒక వ్యక్తి తను గొప్పవాడు కావాలనో, గొప్ప పని చేయాలనో అనుకోవడంలో తప్పులేదు. కానీ ఇతరులకన్నా అధికున్నని అనుకోవడం, గొప్ప వస్తువులన్నీ ఇతరులకు కాక తనకే చెందాలనుకోవడంవల్ల మాత్రమే ముప్పు వస్తుంది. ఈ మహా ప్రపంచంలో ప్రతీ జీవికి ఎదో ఒక విషయంలో ప్రావిణ్యం పొంది రాణించగలిగే సామర్థ్యం ఆ శివుడే కలిగించాడు. ఏ ఒక్కరు అన్నివిషయాల్లో శ్రేష్ఠులు కాలేరు. ఈ జగత్తులో ఒకరిపై ఒకరం ప్రత్యక్షంగానో పరోక్షంగానో అధారపడవలసిందే. అంతెందుకు ఆ శివుడే అన్నిజీవుల యందు ఉన్నవాడు, వారి రూపంలో ఉంటాడు అని భావించినప్పుడు ఇతరులను, వారి సామర్థ్యం తెలిసినా తెలియక పోయినా, ముందు వారిని గౌరవించడం అలవాటవుతుంది. ఇంట్లో పని చేసే పనిమనిషిని కూడా "ఏమమ్మా" అని గౌరవంగా సంభోదించడం మొదలవుతుంది.
గొప్పగా మారడం దైవప్రవుత్తి అయితే, గొప్పవన్నీ తనకు మాత్రమే చెందాలనుకోవడం రాక్షస లక్షణం. అంటే గొప్ప పనులు చేయడం, ఇతరులకన్నా నేను గొప్పవాన్ననుకోవడం - ఈ రెంటి మధ్య ఒక కనిపించని సరిహద్దు ఉంది. మనస్సుకి ఈ సరిహద్దును అలవాటు చేయడం ఇక్కడ చేస్తున్న ప్రస్తావన.
నేను ఇతరులకన్నాఅధికున్నికాను అనే వినయాన్ని అలవరచుకోవడం, నేను చిన్నవాన్ని అన్న దానిలో తృప్తిచెందడం చాలా అవసరమని ఈ వచనం గుర్తు చేస్తుంది. ఒక పెద్ద అధికారిక పదవిలో ఉన్న వ్యక్తికి, లేదా కొన్ని ఘనకార్యాలు సాధించిన వ్యక్తికి ఇలాంటి అనకువ భావం కలగడం కొంచం కష్టమే.గర్వపడే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కానీ వినయాన్నిఅలవరచు కోవడం చాలా ముఖ్యం. అది ఇతరుల ప్రబోధాల వల్ల సాధ్యం కాదు. ఇలాంటి సూచనను ఎవరికి వారు తమ మనస్సుకు చెప్పుకుంటూ ఉండాలి. అందుకే ఇది ఇతరులకు భోదించడానికి వ్రాసిన వచనంలా కాకుండా తనకు తాను వ్రాసుకున్న వచనంలా చెప్పబడింది. బసవన్న ఒక దేశానికే ప్రధానమంత్రి పదవిలో ఉన్నవాడు. చక్రవర్తి చేత గౌరవించబడిన వాడు. ఒక నూతన సమాజానికి పునాది వేసిన వాడు. మరి అంతటి ఉన్నత పదవిలో ఉన్న బసవన్న శివశరణుల, జంగమల పాదాక్రాన్తుడయ్యేవాడు. అది ఎలా కుదిరింది? అంటే, ఈ వచనాన్ని నిత్యం మనస్సుకి అలవరచు కోవడం వల్ల.
ఈ భావాన్ని తరువాతి కాలంలో చాలామంది భక్తులు స్వీకరించారు. ఉదాహరణకు త్యాగరాజ పంచరత్న కీర్తనలలో మిక్కిలి ప్రాచుర్యం పొందిన "ఎందఱో మహానుభావులు, అందరికీ వందనములు" అందరికి పరిచయమే.
తను చేస్తున్న ప్రతిపనిని శివాజ్ఞగా భావిస్తే, ఎదైనా ఘనత కలిగే కార్యం చేస్తే అది తన గొప్పతనముగా కాక శివుడిచ్చిన అవకాశంగా, ఆపనిలో కీర్తి లభిస్తే దాన్ని శివుని ఉపకారంగా మనస్సుకు అలవాటు చేయడం వల్ల ఈ అణకువతనం (Modesty) మనోలక్షణమవుతుంది.
ఇక రెండో ప్రస్తావన శివభక్తుల గొప్పదనం.
శివభక్తులంటే తమ తన, మన, ధన, ప్రాణాలను శివాధీనం చేసి, స్వార్థాన్ని మరచి, లోక శ్రేయస్సుకై పాటుపడేవారు. దధీచి వృత్తాంతాన్ని గుర్తు చేసుకోండి. ఒకనాడు దక్ష యజ్ఞంలో దక్షున్నీ, దేవతలనూ ఆక్షేపించిన శివభక్తుడు. అక్కడ జరుగుతున్న విపరీతాన్ని నిర్మొహమాటంగా ప్రతిఘటించి వెళ్లిపోయాడు. అదే దధీచి అవసరం పడిననాడు, మరోమారు ఆలోచించక, ప్రాణ త్యాగంచేసి తన వెన్నెముకను వజ్రయుధానికి ధారపోసాడు. శివభక్తులంటే అలా ఉంటారు. తమ జీవితాన్ని కేవలం శివారాధనకు అర్పించి, నిత్య శివస్మరణతో, శివోహ భావంతో, శివ జ్ఞానాన్ని పంచుతూ, లింగాంగ సామరస్యంతో, సంచరించే శివస్వరూపులైన శివభక్తులకంటే గొప్పవారుంటారా?
వారిని గౌరవించడం, వారి ఆజ్ఞను శిరసావహించడం ఎంత ముఖ్యమో తెలిసి ఈ భావాన్ని అలవరచుకోవడం, పాటిస్తానని ఆ శివుని సాక్షిగా ప్రమాణం చేసుకోవడం ప్రతీ వీరశైవుని ధర్మం.
శరణు శరణార్థి !!
ಎನಗಿಂತ ಕಿರಿಯರಿಲ್ಲ!
ಶಿವಭಕ್ತರಿಗಿಂತ ಹಿರಿಯರಿಲ್ಲ.
ನಿಮ್ಮ ಪಾದ ಸಾಕ್ಷಿ ಎನ್ನ ಮನ ಸಾಕ್ಷಿ!
ಕೂಡಲಸಂಗಮದೇವಾ ಎನಗಿದೇ ದಿಬ್ಯ.
తెలుగు లిపిలో
ఎనగింత కిరియరిల్ల, శివభక్తరిగింత హిరియరిల్ల!
నిమ్మ పాద సాక్షి, ఎన్న మన సాక్షి
కూడలసంగమదేవా ఎనగిదే దిబ్య.
తెలుగు వచనం
నాకన్నా అల్పులు లేరు, శివభక్తుల మించు శ్రేష్ఠులు లేరు!
నీ పాద సాక్షి , నా మనస్సు సాక్షి
కూడలసంగమదేవా నాకిదే దివ్యం!
వచనకర్త ఆంతర్యం:
శివభక్తుల ముందు నా స్థానం చాలా చిన్నదని తలచి శరణు-శరణార్థి అని పలకాలి. అవి కేవలం వాడుక పదములేగాక శివచరణార్పితమైన మనస్సాక్షిగా నమ్మిన మాటలు, చేసే ప్రమాణం. అటువంటి విశ్వాసమే నాకు దివ్యపదం.
విశ్లేషణ:
ఈ చిన్న వచనంలో భక్తుడు తన మనస్సును నిర్దేశించుకోవడాన్ని, ఇతరులతో వ్యవహరించే విధానాన్ని చెబుతోంది.
వీరశైవులు పాటించే ఆచారాలలో భృత్యాచారం ఒకటి. బసవన్నఈ ఆచారాన్ని తన జీవన శైలిలో జీర్నింపజేసి చూపిన ఘటనలు అతని చరిత్రలో చాలా కనిపిస్తాయి. అయితే భృత్యాచారాన్ని పాటించేవాడు ఆలోచించే విధానన్ని ఈ వచనం స్పష్టంగా చుపెడతోంది. ఇది బసవన్న తనకు తాను వ్రాసుకున్న వచనంగా అగుపిస్తోంది.
సాధారణంగా నేను ఇతరులకంటే గొప్పవాన్ని కావాలనే తాపత్రయం ప్రతివానికి మానసికంగా అలవాటు పడి ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఇతరులతో పోటీపడి జగడాలుపడుతూ ఉంటారు. ఈ కాలములో చదువులో, ఆటలలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, అన్నింటిలో పోటీలు అధికమైనాయి. అయితే ఈ పోటీలు ఆరోగ్యకరమైతే ఫరవాలేదు. చాలా సందర్భాలలో నేను "ఇతరులకంటే గొప్పవాణ్ణి అనిపించుకోవాలనే" అలోచన, చుట్టూ ఉండే వాతావరణాన్ని మార్చి మనస్పర్ధలకు, అనవసర తగవులకు దారి తీస్తాయి. కొన్ని సార్లు ప్రత్యక్షంగా కనబడతాయి. కొన్నిసార్లు పరోక్షంగా మనకు తెలియకుండానే మనస్సును తొలుస్తూ ఉంటాయి.
ఈ వ్యవహారం వ్యక్తులకే గాక సమాజాలకు, జాతులకు, దేశాలకూ వర్తిస్తాయి. ఉదాహరణకు కొన్ని దేశాలు తమ ఆధిక్యాన్ని చాటుకోవడానికి పరోక్షయుద్ధం (cold war) లో చాలాకాలం ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా తమ మతం ఇతరుల మతం కన్నా గొప్పదన్న భావంతో హింసకు పాల్పడుతున్న వారిని చూస్తున్నాము.
ఈ విషయాన్నీ కొంచం పరిశీలిస్తే, ఒక వ్యక్తి తను గొప్పవాడు కావాలనో, గొప్ప పని చేయాలనో అనుకోవడంలో తప్పులేదు. కానీ ఇతరులకన్నా అధికున్నని అనుకోవడం, గొప్ప వస్తువులన్నీ ఇతరులకు కాక తనకే చెందాలనుకోవడంవల్ల మాత్రమే ముప్పు వస్తుంది. ఈ మహా ప్రపంచంలో ప్రతీ జీవికి ఎదో ఒక విషయంలో ప్రావిణ్యం పొంది రాణించగలిగే సామర్థ్యం ఆ శివుడే కలిగించాడు. ఏ ఒక్కరు అన్నివిషయాల్లో శ్రేష్ఠులు కాలేరు. ఈ జగత్తులో ఒకరిపై ఒకరం ప్రత్యక్షంగానో పరోక్షంగానో అధారపడవలసిందే. అంతెందుకు ఆ శివుడే అన్నిజీవుల యందు ఉన్నవాడు, వారి రూపంలో ఉంటాడు అని భావించినప్పుడు ఇతరులను, వారి సామర్థ్యం తెలిసినా తెలియక పోయినా, ముందు వారిని గౌరవించడం అలవాటవుతుంది. ఇంట్లో పని చేసే పనిమనిషిని కూడా "ఏమమ్మా" అని గౌరవంగా సంభోదించడం మొదలవుతుంది.
గొప్పగా మారడం దైవప్రవుత్తి అయితే, గొప్పవన్నీ తనకు మాత్రమే చెందాలనుకోవడం రాక్షస లక్షణం. అంటే గొప్ప పనులు చేయడం, ఇతరులకన్నా నేను గొప్పవాన్ననుకోవడం - ఈ రెంటి మధ్య ఒక కనిపించని సరిహద్దు ఉంది. మనస్సుకి ఈ సరిహద్దును అలవాటు చేయడం ఇక్కడ చేస్తున్న ప్రస్తావన.
నేను ఇతరులకన్నాఅధికున్నికాను అనే వినయాన్ని అలవరచుకోవడం, నేను చిన్నవాన్ని అన్న దానిలో తృప్తిచెందడం చాలా అవసరమని ఈ వచనం గుర్తు చేస్తుంది. ఒక పెద్ద అధికారిక పదవిలో ఉన్న వ్యక్తికి, లేదా కొన్ని ఘనకార్యాలు సాధించిన వ్యక్తికి ఇలాంటి అనకువ భావం కలగడం కొంచం కష్టమే.గర్వపడే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కానీ వినయాన్నిఅలవరచు కోవడం చాలా ముఖ్యం. అది ఇతరుల ప్రబోధాల వల్ల సాధ్యం కాదు. ఇలాంటి సూచనను ఎవరికి వారు తమ మనస్సుకు చెప్పుకుంటూ ఉండాలి. అందుకే ఇది ఇతరులకు భోదించడానికి వ్రాసిన వచనంలా కాకుండా తనకు తాను వ్రాసుకున్న వచనంలా చెప్పబడింది. బసవన్న ఒక దేశానికే ప్రధానమంత్రి పదవిలో ఉన్నవాడు. చక్రవర్తి చేత గౌరవించబడిన వాడు. ఒక నూతన సమాజానికి పునాది వేసిన వాడు. మరి అంతటి ఉన్నత పదవిలో ఉన్న బసవన్న శివశరణుల, జంగమల పాదాక్రాన్తుడయ్యేవాడు. అది ఎలా కుదిరింది? అంటే, ఈ వచనాన్ని నిత్యం మనస్సుకి అలవరచు కోవడం వల్ల.
ఈ భావాన్ని తరువాతి కాలంలో చాలామంది భక్తులు స్వీకరించారు. ఉదాహరణకు త్యాగరాజ పంచరత్న కీర్తనలలో మిక్కిలి ప్రాచుర్యం పొందిన "ఎందఱో మహానుభావులు, అందరికీ వందనములు" అందరికి పరిచయమే.
తను చేస్తున్న ప్రతిపనిని శివాజ్ఞగా భావిస్తే, ఎదైనా ఘనత కలిగే కార్యం చేస్తే అది తన గొప్పతనముగా కాక శివుడిచ్చిన అవకాశంగా, ఆపనిలో కీర్తి లభిస్తే దాన్ని శివుని ఉపకారంగా మనస్సుకు అలవాటు చేయడం వల్ల ఈ అణకువతనం (Modesty) మనోలక్షణమవుతుంది.
ఇక రెండో ప్రస్తావన శివభక్తుల గొప్పదనం.
శివభక్తులంటే తమ తన, మన, ధన, ప్రాణాలను శివాధీనం చేసి, స్వార్థాన్ని మరచి, లోక శ్రేయస్సుకై పాటుపడేవారు. దధీచి వృత్తాంతాన్ని గుర్తు చేసుకోండి. ఒకనాడు దక్ష యజ్ఞంలో దక్షున్నీ, దేవతలనూ ఆక్షేపించిన శివభక్తుడు. అక్కడ జరుగుతున్న విపరీతాన్ని నిర్మొహమాటంగా ప్రతిఘటించి వెళ్లిపోయాడు. అదే దధీచి అవసరం పడిననాడు, మరోమారు ఆలోచించక, ప్రాణ త్యాగంచేసి తన వెన్నెముకను వజ్రయుధానికి ధారపోసాడు. శివభక్తులంటే అలా ఉంటారు. తమ జీవితాన్ని కేవలం శివారాధనకు అర్పించి, నిత్య శివస్మరణతో, శివోహ భావంతో, శివ జ్ఞానాన్ని పంచుతూ, లింగాంగ సామరస్యంతో, సంచరించే శివస్వరూపులైన శివభక్తులకంటే గొప్పవారుంటారా?
వారిని గౌరవించడం, వారి ఆజ్ఞను శిరసావహించడం ఎంత ముఖ్యమో తెలిసి ఈ భావాన్ని అలవరచుకోవడం, పాటిస్తానని ఆ శివుని సాక్షిగా ప్రమాణం చేసుకోవడం ప్రతీ వీరశైవుని ధర్మం.
శరణు శరణార్థి !!
Eppdu veershivulu samajalanu araputu cheshusutunaru, kani basava vachana loni sukthi ni kochanam kuda anusarichuntaladu.Ee vishadikaran bangundi.sharanu shranarthi.
ReplyDelete