కన్నడ వచనం:
ಉಳ್ಳವರು ಶಿವಾಲಯವ ಮಾಡುವರು !
ನಾನೇನ ಮಾಡುವೆ ? ಬಡವನಯ್ಯ!
ಎನ್ನ ಕಾಲೇ ಕಂಬ, ದೇಹವೇ ದೇಗುಲ,
ಶಿರವೇ ಹೊನ್ನ ಕಳಶವಯ್ಯ!
ಕೂಡಲಸಂಗಮದೇವ ಕೇಳಯ್ಯ,
ಸ್ಥಾವರಕ್ಕಳಿವುಂಟು, ಜಂಗಮಕ್ಕಳಿವಿಲ್ಲ!
తెలుగు లిపిలో:
ఉళ్ళవరు శివాలయవ మాడువరు!
నానేన మాడువె? బడవనయ్య!
ఎన్న కాలే కంబ, దేహవే దేగుల,
శిరవే హొన్న కలశవయ్య,
కుడలసంగమదేవా కేళయ్య,
స్థావరక్కళివుంటు, జంగామక్కళివిల్ల
తెలుగు వచనం:
ఉన్నవాళ్లు శివాలయాలు కట్టెదరు గాక!
నావల్ల ఏమౌను? బీదవాణ్నయ్యా
నా కాళ్ళే స్థంబాలు, దేహమే దేవళము, శిరమే బంగారు కలశమయ్య
ఓ కూడల సంగమేశ్వర, వినవయ్య
స్థావరాలకు కలి వుండు గాని జంగమునకు కాదయ్యా
వచనకర్త ఆంతర్యం:
పేదవాణ్ని నీకు గుడి కట్టలేను స్వామి. కాని ఒక ఉపాయం ఉంది. నా కాళ్ళు గుడి స్థంబాలు గా మారుస్తాను. మరి శరీరం గుడి అవుతుంది. హృదయం గర్భగుడి అనుకో. శిరము స్వర్ణ శిఖరం. నీకింకేం కావలి చెప్పు? ఒచ్చి ఇందులో ఉండవయ్యా ఓ కూడల సంగమేశ్వర!!
ఇందులో ఇంకో గొప్ప సౌలభ్యం ఉందయ్యో!! గుళ్ళో అయితే (స్థావరం) ఒక దెగ్గర కూర్చో బెడతారు. నేనైతే అన్ని చోట్లకి తిప్పుతా (జంగమం). నిరాటంకంగా పూజిస్తా. నాకాకలైనప్పుడల్లా నీకూ నైవేద్యం, అందరితో మాట్లాడవచ్చు, కలసి తిరగొచ్చు, మన స్నేహానికి నాశమే లేదు కదా? మరి నా మాట విని, నా శరీరం అనే గుడిలో కొలువుండవయ్య..
విశ్లేషణ:
బసవేశ్వరుడు ఈ వచనములో అందరికీ ఆచరణ యోగ్యమైన శివారాధన విషయాన్నీ ప్రస్థావించాడు.
1. శివారాధన గొప్పవాళ్ళు, సంపన్నులే గాక పేద వాళ్ళు కూడా సాధించ వచ్చు అనేది మొదటి ప్రస్తావన. పేదవాళ్లైనంత మాత్రాన, ధనం లేనంత మాత్రాన, మాతో కాదని భక్తిని విడువడం సరికాదు. అది జడత్వాని ప్రతీక.
పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నట్టు ఉన్నదానితో దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవడం ముఖ్యము. దేవుడు గొప్ప వాటినే కోరుకోడు - మనసుని చూస్తాడు అనేది ఎక్కడ గుర్తు చేస్తున్నారు .
2. మనిషి తన శరీరాన్ని దేవాలయంగా మార్చుకుని భగవంతుని నివాస యోగ్యoగా చేసుకోగల్గడం అనేది ఆంతరంగిక శుద్ధిని సూచిస్తుంది. మనస్సులో శివున్ని ప్రతిష్టించు కోవడమంటే, ఎంత నిర్మలంగా ఉండాలి? కల్మషరహింతంగా, ఇతరులను బాధ పెట్టకుండా, అరిషడ్వగాలను అదుపులో పెట్టుకోగలిగే స్థితికి చేరుకుంటే, భక్తితో తనను తాను సమర్పించుకుంటే, ఆ దేహము శివాలయమే ఆవుతుంది. అలాంటి ఆలయంలో శివుడు ఎందుకు ఉండడు?
3. స్థావరక్కలళివుంటు , జంగమక్కళివిళ్ళ: ఈ వాక్యాన్ని వివిధ రకాలుగా అర్థం చేసుకొవచ్చు. నా ఉద్దేశ్యంలో ఇది దేవుణ్ణి బ్రతిమాలు కోవడానికి బసవన్న చూపిన ఆశగా భావిస్తున్నను. నా దెగ్గరైతే నీ పూజా పునస్కారాలకి నాశనముండదు - స్థావరం (గుడిలో) అయితే అందరు రోజు వచ్చి పూజిస్తారని ఏంటి నమ్మకం? ఆ కాలంలో జనాలు తక్కువ. ఊరి బయట, అడవుల్లో గుళ్ళకి అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళు. నా దేహంతో ఉంటె ఎప్పుడు నిన్ను కనిపెట్టుకొని ఉంటాను అని.
కొందరు వేరే అర్థాలు చెప్పారు. గుళ్ళు అయితే నశించి పోతాయి అని. మనస్సు నశించదు అని.
4. అతి ముఖ్యమైన ప్రతిపాదన వీరశైవుల ఆంతరంగిక ఉపాసనా విధానం. బాహ్య లింగార్చన లో శివుడు జీవుడు వేరుగా ఊహించుకొని చేస్తారు. వీరశైవులు లింగాంగ సామరస్యంతో చేస్తారు. అనగా మనలోని జీవము , చేతిలోని శివలింగము ఒకటే అనే విశ్వాసము. ఇందులో లింగాన్ని విగ్రహంగా కాకుండా తన దేహానికి సమానంగా, లేదా దేహంలోని అతి ముఖ్యమైన భాగంగా (ప్రాణ సమానంగా) భావించడం. ఆ ప్రాణమే శివుడని నమ్మిన నాడు ఈ దేహమే దేవాలయం అవుతుంది.
ಉಳ್ಳವರು ಶಿವಾಲಯವ ಮಾಡುವರು !
ನಾನೇನ ಮಾಡುವೆ ? ಬಡವನಯ್ಯ!
ಎನ್ನ ಕಾಲೇ ಕಂಬ, ದೇಹವೇ ದೇಗುಲ,
ಶಿರವೇ ಹೊನ್ನ ಕಳಶವಯ್ಯ!
ಕೂಡಲಸಂಗಮದೇವ ಕೇಳಯ್ಯ,
ಸ್ಥಾವರಕ್ಕಳಿವುಂಟು, ಜಂಗಮಕ್ಕಳಿವಿಲ್ಲ!
తెలుగు లిపిలో:
ఉళ్ళవరు శివాలయవ మాడువరు!
నానేన మాడువె? బడవనయ్య!
ఎన్న కాలే కంబ, దేహవే దేగుల,
శిరవే హొన్న కలశవయ్య,
కుడలసంగమదేవా కేళయ్య,
స్థావరక్కళివుంటు, జంగామక్కళివిల్ల
తెలుగు వచనం:
ఉన్నవాళ్లు శివాలయాలు కట్టెదరు గాక!
నావల్ల ఏమౌను? బీదవాణ్నయ్యా
నా కాళ్ళే స్థంబాలు, దేహమే దేవళము, శిరమే బంగారు కలశమయ్య
ఓ కూడల సంగమేశ్వర, వినవయ్య
స్థావరాలకు కలి వుండు గాని జంగమునకు కాదయ్యా
వచనకర్త ఆంతర్యం:
పేదవాణ్ని నీకు గుడి కట్టలేను స్వామి. కాని ఒక ఉపాయం ఉంది. నా కాళ్ళు గుడి స్థంబాలు గా మారుస్తాను. మరి శరీరం గుడి అవుతుంది. హృదయం గర్భగుడి అనుకో. శిరము స్వర్ణ శిఖరం. నీకింకేం కావలి చెప్పు? ఒచ్చి ఇందులో ఉండవయ్యా ఓ కూడల సంగమేశ్వర!!
ఇందులో ఇంకో గొప్ప సౌలభ్యం ఉందయ్యో!! గుళ్ళో అయితే (స్థావరం) ఒక దెగ్గర కూర్చో బెడతారు. నేనైతే అన్ని చోట్లకి తిప్పుతా (జంగమం). నిరాటంకంగా పూజిస్తా. నాకాకలైనప్పుడల్లా నీకూ నైవేద్యం, అందరితో మాట్లాడవచ్చు, కలసి తిరగొచ్చు, మన స్నేహానికి నాశమే లేదు కదా? మరి నా మాట విని, నా శరీరం అనే గుడిలో కొలువుండవయ్య..
విశ్లేషణ:
బసవేశ్వరుడు ఈ వచనములో అందరికీ ఆచరణ యోగ్యమైన శివారాధన విషయాన్నీ ప్రస్థావించాడు.
1. శివారాధన గొప్పవాళ్ళు, సంపన్నులే గాక పేద వాళ్ళు కూడా సాధించ వచ్చు అనేది మొదటి ప్రస్తావన. పేదవాళ్లైనంత మాత్రాన, ధనం లేనంత మాత్రాన, మాతో కాదని భక్తిని విడువడం సరికాదు. అది జడత్వాని ప్రతీక.
పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నట్టు ఉన్నదానితో దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవడం ముఖ్యము. దేవుడు గొప్ప వాటినే కోరుకోడు - మనసుని చూస్తాడు అనేది ఎక్కడ గుర్తు చేస్తున్నారు .
2. మనిషి తన శరీరాన్ని దేవాలయంగా మార్చుకుని భగవంతుని నివాస యోగ్యoగా చేసుకోగల్గడం అనేది ఆంతరంగిక శుద్ధిని సూచిస్తుంది. మనస్సులో శివున్ని ప్రతిష్టించు కోవడమంటే, ఎంత నిర్మలంగా ఉండాలి? కల్మషరహింతంగా, ఇతరులను బాధ పెట్టకుండా, అరిషడ్వగాలను అదుపులో పెట్టుకోగలిగే స్థితికి చేరుకుంటే, భక్తితో తనను తాను సమర్పించుకుంటే, ఆ దేహము శివాలయమే ఆవుతుంది. అలాంటి ఆలయంలో శివుడు ఎందుకు ఉండడు?
3. స్థావరక్కలళివుంటు , జంగమక్కళివిళ్ళ: ఈ వాక్యాన్ని వివిధ రకాలుగా అర్థం చేసుకొవచ్చు. నా ఉద్దేశ్యంలో ఇది దేవుణ్ణి బ్రతిమాలు కోవడానికి బసవన్న చూపిన ఆశగా భావిస్తున్నను. నా దెగ్గరైతే నీ పూజా పునస్కారాలకి నాశనముండదు - స్థావరం (గుడిలో) అయితే అందరు రోజు వచ్చి పూజిస్తారని ఏంటి నమ్మకం? ఆ కాలంలో జనాలు తక్కువ. ఊరి బయట, అడవుల్లో గుళ్ళకి అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళు. నా దేహంతో ఉంటె ఎప్పుడు నిన్ను కనిపెట్టుకొని ఉంటాను అని.
కొందరు వేరే అర్థాలు చెప్పారు. గుళ్ళు అయితే నశించి పోతాయి అని. మనస్సు నశించదు అని.
4. అతి ముఖ్యమైన ప్రతిపాదన వీరశైవుల ఆంతరంగిక ఉపాసనా విధానం. బాహ్య లింగార్చన లో శివుడు జీవుడు వేరుగా ఊహించుకొని చేస్తారు. వీరశైవులు లింగాంగ సామరస్యంతో చేస్తారు. అనగా మనలోని జీవము , చేతిలోని శివలింగము ఒకటే అనే విశ్వాసము. ఇందులో లింగాన్ని విగ్రహంగా కాకుండా తన దేహానికి సమానంగా, లేదా దేహంలోని అతి ముఖ్యమైన భాగంగా (ప్రాణ సమానంగా) భావించడం. ఆ ప్రాణమే శివుడని నమ్మిన నాడు ఈ దేహమే దేవాలయం అవుతుంది.
Basava satakam untey pettagalaru
ReplyDelete