కన్నడ వచనం:
ದಯವೇ ಬೇಕು ಸರ್ವಪ್ರಾಣಿಗಳೆಲ್ಲರಲ್ಲಿ!
ದಯವೇ ಧರ್ಮದ ಮೂಲವಯ್ಯ.
ಕೂಡಲಸಂಗಯ್ಯನಂತಲ್ಲದೊಲ್ಲ ಕಂಡಯ್ಯ.
తెలుగు లిపిలో :
దయవిల్లద ధర్మవదేవుదయ్యా?
దయవే బేకు సర్వప్రాణిగళెల్లరల్లి!
దయవే ధర్మద మూలవయ్యా
కూడలసంగయ్యనంతల్లదొల్ల కండయ్యా
తెలుగు వచనం:
దయలేని ధర్మమెటువంటిదయ్యా?
దయతోనుండాలి సర్వప్రాణులన్నింటిపై !
దయే ధర్మమునకు మూలమయ్యా
కూడలసంగయ్యఅదిలేక ఒల్లడయ్య వినవయ్యా
వచనకర్త ఆంతర్యం:
ఏ ధర్మానికైనా మూలం దయతో మొదలవ్వాలి. దయలేని ధర్మము ఏవిధంగా ఉపయోగపడుతుంది? కేవలం మనుష్యుల పైనేగాక ప్రాణికోటి అంతటిపై దయ చూపించ గలిగేదే నిజమైన ధర్మం. మతం పేరుతో అరాచకాలు, కష్టాల్లో ఉన్న జీవులను చూస్తూ మనసు చలించకపోవడం, అదే సమయంలో అటువంటి వ్యవహారాన్ని ధర్మానికి ఆపాదించడం ఒక స్వార్థపరుల సంఘమేగాని ధర్మమనబడదు. తాను ఎంతో దయతో సృష్టించిన ఈ జగత్తులో, దయలేని జీవులను తనదెగ్గరకు రానిచ్చునా ఆ కూడల సంగమ దేవుడు?
విశ్లేషణ:
ఆనాటి కాలంలో మనుష్యులు ధర్మము పేర కొన్ని మౌడ్యాలు, మూఢవిశ్వాసాలు పెరిగి, స్వార్థంతో దయను మరిచి కొన్ని తెగల వారు ఇంతరులపై కఠినంగా వ్యవహరించి ఉండవచ్చు. అలాంటి ధర్మం పేరితో చేసే నిర్దయత్వంపై వచన కర్త ఈవిధంగా స్పందించినట్లు అనిపిస్తుంది. కాని ఇన్ని వందల సంవత్సరాల తరువాత పరిస్థితి మారిందా?
ఈనాటి సమాజంలో కూడా ఒకవైపు మనిషి అభివృద్ధి పథంతో ముందుకి వెళ్తున్నా, ఎన్నో ప్రకృతి నియమాలను అతిక్రమిస్తూనే ఉన్నాడు. మన స్వార్థం కోసం కొంచం కూడా ఆలోచించకుండా ఎన్నో జీవాల ఉనికికి ప్రమాదమయ్యాము. కనీసం మనుషులైనా ప్రశాంతంగా లేకుండా మతం పేరుతో పిచ్చి ముదిరి ఇతరులను చంపి ఆనందించే సమాజాలను రోజు చూస్తున్నాము. కాబట్టి ఈ వచనం ఈనాటి స్థితికి ఎక్కడా తీసిపోకుండా ఉంది.
పరమేశ్వరుడు సృష్టించిన జీవులన్ని ఒకరిపై ఒకటి ఆధారపడే ఉంటాయి. అలాంటప్పుడు కారుణ్యన్ని మరచి సంచరిస్తే సమతూల్యత (balance) తగ్గి, విపరీతాలు జరుగుతాయి. ఎన్నో ప్రాకృతిక ఓషధులు, జీవులు ఇప్పుడు కనిపించకపోవడం ఇందుకు ఉదాహరణ. అలాంటి వ్యవహారాన్ని ఆ శివుడు సహించడు.
ఈ వచనంలో దయని పలు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. కారుణ్యం, సానుభూతి, భూతదయ, అహింస, ప్రేమ వంటి మెత్తని స్వభావాల మిళితమే దయ. భగవంతుని ప్రేమ తల్లిదండ్రుల ప్రేమవలే నిస్వార్థమైనది (unconditional love).ఆ ప్రేమ భగవంతునికి సకలజీవకోటిపై ఉంటుంది. అలాంటి నిస్వార్థ ప్రేమని అందరిమధ్యా ప్రేరేపించేది వీరశైవ ధర్మం.
వీటిని వీరశైవులు వారి ధర్మము నియమాలుగా, నిత్యాచారలుగా పాటిస్తూనే ఉంటారు. సమాజంలో ఒకరికొకరు సహకరించుకోవడానికే దాసోహాలను ఏర్పాటు చేసారు. హింసకి దూరంగా ఉంటూ, కారుణ్య వ్యవహారులై శాకాహారులుగా (vegetarians) జీవనం సాగిస్తారు. ప్రతి మనిషిని దయతో, ప్రేమతో పలుకరించడం, శరణు-శరణార్థి భావంతో మెలగడం ఇవన్నీ అలాంటి ఉత్కృష్ఠ ధర్మానికి ఉదాహరణలు. శివుణ్ణి ప్రతివస్తువులో చూడగల్గిన నాడు ఆ ప్రేమ ఉప్పొంగి వస్తుంది.
కనుక మనం ఈ నియమాల వెనక ఉండే దయాభావాన్ని ఎప్పుడు గుర్తుంచుకొని, ఈ దయతో కూడిన వీరశైవ ధర్మాన్ని విడువక సమాజంలో వ్యవహరిస్తే శివానుగ్రహం తప్పక లభిస్తుంది.
దయవే బేకు సర్వప్రాణిగళెల్లరల్లి!
దయవే ధర్మద మూలవయ్యా
కూడలసంగయ్యనంతల్లదొల్ల కండయ్యా
తెలుగు వచనం:
దయలేని ధర్మమెటువంటిదయ్యా?
దయతోనుండాలి సర్వప్రాణులన్నింటిపై !
దయే ధర్మమునకు మూలమయ్యా
కూడలసంగయ్యఅదిలేక ఒల్లడయ్య వినవయ్యా
వచనకర్త ఆంతర్యం:
ఏ ధర్మానికైనా మూలం దయతో మొదలవ్వాలి. దయలేని ధర్మము ఏవిధంగా ఉపయోగపడుతుంది? కేవలం మనుష్యుల పైనేగాక ప్రాణికోటి అంతటిపై దయ చూపించ గలిగేదే నిజమైన ధర్మం. మతం పేరుతో అరాచకాలు, కష్టాల్లో ఉన్న జీవులను చూస్తూ మనసు చలించకపోవడం, అదే సమయంలో అటువంటి వ్యవహారాన్ని ధర్మానికి ఆపాదించడం ఒక స్వార్థపరుల సంఘమేగాని ధర్మమనబడదు. తాను ఎంతో దయతో సృష్టించిన ఈ జగత్తులో, దయలేని జీవులను తనదెగ్గరకు రానిచ్చునా ఆ కూడల సంగమ దేవుడు?
విశ్లేషణ:
ఆనాటి కాలంలో మనుష్యులు ధర్మము పేర కొన్ని మౌడ్యాలు, మూఢవిశ్వాసాలు పెరిగి, స్వార్థంతో దయను మరిచి కొన్ని తెగల వారు ఇంతరులపై కఠినంగా వ్యవహరించి ఉండవచ్చు. అలాంటి ధర్మం పేరితో చేసే నిర్దయత్వంపై వచన కర్త ఈవిధంగా స్పందించినట్లు అనిపిస్తుంది. కాని ఇన్ని వందల సంవత్సరాల తరువాత పరిస్థితి మారిందా?
ఈనాటి సమాజంలో కూడా ఒకవైపు మనిషి అభివృద్ధి పథంతో ముందుకి వెళ్తున్నా, ఎన్నో ప్రకృతి నియమాలను అతిక్రమిస్తూనే ఉన్నాడు. మన స్వార్థం కోసం కొంచం కూడా ఆలోచించకుండా ఎన్నో జీవాల ఉనికికి ప్రమాదమయ్యాము. కనీసం మనుషులైనా ప్రశాంతంగా లేకుండా మతం పేరుతో పిచ్చి ముదిరి ఇతరులను చంపి ఆనందించే సమాజాలను రోజు చూస్తున్నాము. కాబట్టి ఈ వచనం ఈనాటి స్థితికి ఎక్కడా తీసిపోకుండా ఉంది.
పరమేశ్వరుడు సృష్టించిన జీవులన్ని ఒకరిపై ఒకటి ఆధారపడే ఉంటాయి. అలాంటప్పుడు కారుణ్యన్ని మరచి సంచరిస్తే సమతూల్యత (balance) తగ్గి, విపరీతాలు జరుగుతాయి. ఎన్నో ప్రాకృతిక ఓషధులు, జీవులు ఇప్పుడు కనిపించకపోవడం ఇందుకు ఉదాహరణ. అలాంటి వ్యవహారాన్ని ఆ శివుడు సహించడు.
ఈ వచనంలో దయని పలు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. కారుణ్యం, సానుభూతి, భూతదయ, అహింస, ప్రేమ వంటి మెత్తని స్వభావాల మిళితమే దయ. భగవంతుని ప్రేమ తల్లిదండ్రుల ప్రేమవలే నిస్వార్థమైనది (unconditional love).ఆ ప్రేమ భగవంతునికి సకలజీవకోటిపై ఉంటుంది. అలాంటి నిస్వార్థ ప్రేమని అందరిమధ్యా ప్రేరేపించేది వీరశైవ ధర్మం.
వీటిని వీరశైవులు వారి ధర్మము నియమాలుగా, నిత్యాచారలుగా పాటిస్తూనే ఉంటారు. సమాజంలో ఒకరికొకరు సహకరించుకోవడానికే దాసోహాలను ఏర్పాటు చేసారు. హింసకి దూరంగా ఉంటూ, కారుణ్య వ్యవహారులై శాకాహారులుగా (vegetarians) జీవనం సాగిస్తారు. ప్రతి మనిషిని దయతో, ప్రేమతో పలుకరించడం, శరణు-శరణార్థి భావంతో మెలగడం ఇవన్నీ అలాంటి ఉత్కృష్ఠ ధర్మానికి ఉదాహరణలు. శివుణ్ణి ప్రతివస్తువులో చూడగల్గిన నాడు ఆ ప్రేమ ఉప్పొంగి వస్తుంది.
కనుక మనం ఈ నియమాల వెనక ఉండే దయాభావాన్ని ఎప్పుడు గుర్తుంచుకొని, ఈ దయతో కూడిన వీరశైవ ధర్మాన్ని విడువక సమాజంలో వ్యవహరిస్తే శివానుగ్రహం తప్పక లభిస్తుంది.
No comments:
Post a Comment