కన్నడ వచనం
ಕೊಲುವನೇ ಮಾದಿಗ, ಹೊಲಸು ತಿಂಬವನೇ ಹೊಲೆಯ
ಕುಲವೇನೋ ಅವಂದಿರ ಕುಲವೇನೋ !
ಸಕಲಜೀವಾತ್ಮರಿಗೆ ಲೇಸನೇ ಬಯಸುವ
ನಮ್ಮ ಕೂಡಲಸಂಗನ ಶರಣರೆ ಕುಲಜರು
తెలుగు లిపిలో
కొలువనే మాదిగ, హొలసు తింబవనే హొలెయ
కులవేనో అవందిర కులవేనో!
సకలజీవాత్మరిగె లేసనే బయసువ
నమ్మ కూడలసంగన శరణరె కులజరు
తెలుగు వచనం
చంపువాడే మాదిగ, నీచము తినువాడే అంటరానివాడు
కులమేదో అట్టి కులమేదో?!
సకలజీవాత్ములను ప్రేమతో జూచెడి
మా కుడలసంగని శరణులే కులజులు
అర్థం
కులమే ఎంచ వలసి వచ్చిన, జీవులకు హాని చేయువాడు మాదిగ. ఇతర జీవుల మాంసమును భక్షించు వాడు అంటరానివాడు. అంతే తప్ప ఇక వేరే కులమే లేదు. శివుని విభూతులైన సకల జీవులను ప్రేమతో చూడాలి. అలాంటి పద్ధతి పాటించే శివ శరణులే ఉత్తమ కులవంతులు.
విశ్లేషణ
వీరశైవులు కులవివక్షను పాటించరని, శివ భక్తులందరిని ఒకే విధంగా ఆదరిస్తారని ఇది వరకు చర్చించుకున్నాము. ఇక్కడ జీవకారుణ్యమును బట్టి ఉచ్ఛనీచములను నిర్ణయించారు బసవన్న.
శివశరణులు పాటించే నియమాలలో అహింస, సర్వ భూతదయ చాలా ముఖ్యమైన విషయములు. "లింగం సర్వమయం జగత్" అని నమ్మడం వల్ల కేవలం ఉదర పోషణార్థమే కాకుండా బలి తర్పణాదులలో యోగ్యమని చేయబడుచున్న హింసను తుచ్ఛములని తిరస్కరించారు. ఎలాంటి విషయంలోనూ జీవహింస కూడదని నమ్మిన వారు వీరశైవులు. అందుకే యజ్ఞములో బలి, జీవహింస ఉంటాయని యజ్ఞాన్ని కూడా సమ్మతించరు. వీరి నిత్య జీవన విధానంలో యజ్ఞము నిషిద్ధము. ప్రాణులన్నీ ఆ శివుని సంతానమే అని దయతో చూసే వీరశైవులు దేనిని చంపరు.
అంతేగాక వీరశైవులు చాలా నిష్ఠ గలిగిన శాకాహారులు (vegetarians). అభక్ష్యభక్షణము, ఆపేయపానములు, అంటే భావిపాకములైన తిను పదార్థము, త్రాగు పానీయము ఏదైనా సరే వీరు ముట్టుకోరు. మాంసము, మద్యము,మాదక ద్రవ్యములు, పొగ వంటివన్నీ నిషిద్ధములు - ఎట్టి పరిస్థితులలోను వాటి జోలికి వీరశైవులు పోరాదు. జీవుని ఆధ్యాత్మిక ఉద్ధరణకు తీసుకునే అన్నము చాలా ముఖ్యము. తినే అన్నములోని సూక్ష్మభాగం బుద్ధికి శక్తినిస్తుందని శాస్త్రము చెబుతుంది. హింసతో కూడిన పదార్థము ఏదైనా దాని సూక్షము బుద్ధిపై ప్రభావము చూపుతుంది, తమో గుణాన్ని పెంచుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక బాటలో నడిచే వారు శాకాహారులుగా ఉండటం చాలా ముఖ్యం - వినా వేరే మార్గము లేదు. అహింసాధర్మాన్ని తమ కులశీలమని ఆజన్మాన్తము పాటిస్తారు వీరశైవులు. అందుకే శరణులే ఉత్తమ కులజులు.
ఈనాడు మనం ధర్మము శాస్త్రజ్ఞానము తెలియక నియమమును తప్పుతున్నాము. కొందరు వంశపారంపర్యంగా అహింస తప్పని తెలిసినా, మాంసాహారము/మద్యపానము నిషిద్ధమని తెలిసినా ఆ విషయాన్ని సదుపాయంకొరకో, జిహ్వచాపల్యంకొరకో విస్మరిస్తున్నారు. సమాజంలో ఇతరులతో కూడి ఉండాలంటే, వారితో వ్యాపారము చేయాలంటే ఇవి అవసరం అని వీళ్ళు చెప్పే సాకు. ఇంకొందరు శాకాహారంలో బలం ఉండదని పిల్లలకు చిన్నప్పటి నుంచే నీచమును తినిపిస్తున్నారు. ఇంకొందరు తాము నిష్ఠగా ఉన్నా తమ పిల్లలు చేస్తే, వారికి తప్పొప్పులు చెప్పకుండా, వారికి స్వీయనిర్ణయ స్వేచ్ఛ (freedom to decide) ఇస్తున్నామని చెప్పుకొని తమను తాము భ్రమ పెట్టుకుంటున్నారు. ఇటువంటి వ్యవహారంవల్ల ముందు తరాల వారికి వీరశైవులు శాకాహారులనే సంగతే తెలియదు. ఇక వారి జ్ఞానార్జన, తరించడం చాలా దూరపు మాట. మీ పిల్లలు తామసిక ఆహారములకు దూరంగా బ్రతకడం వీరశైవ సమాజంలో పుట్టడంవల్ల వారికి కలిగే అదృష్టం. శరణ మార్గంలో జీవించడం వారికి జన్మతారా సంక్రమించిన హక్కు. దాన్ని వారికి తెలియకుండానే వారికి దూరంచేసే అధికారం మీకు ఎవరిచ్చారు?
వీరశైవము సంపూర్ణంగా ఆధ్యాత్మిక మార్గము; దీనికి శివజ్ఞానము, శివజీవైక్యము తప్ప వేరే ధ్యేయమే లేదు. మరి అటువంటి వారికి అన్నము యొక్క సంస్కారము ఎంత ముఖ్యమో మీరే ఊహించండి!! వీరశైవులు పాటించే సదాచారంలో శీలవంతులవడం ముఖ్యము. ఇందులో ఐదవ శీలమైన "సంబంధ శీలము" కోసము శివమార్గములో భావిపాకములైన తామసాహారములు విడువవలెనని నిర్ణయించబడి ఉన్నది.
మరి "ఎటువంటి ఆహారం తీసుకోవాలి?" అనే ప్రశ్న తలెత్త వచ్చు. దీనికి ఒకే కొలబద్దను నిర్ణయించింది మనధర్మము. అదే "ప్రసాదము". వీరశైవులు ఏది తిన్నా శివునికి నివేదించి తినడం అలవాటు చేసుకోవాలి; శివనివేదనం కానిదేదైనా సరే స్వీకరించకూడదు. దీనివల్ల తినే పదార్థము సంస్కరించబడుతుంది. అంతే గాక, శివునికి నివేదించాలి గనుక ఏదిబడితే అది తినే అవకాశం ఉండదు; కేవలం సాత్విక పదార్థం మాత్రమే నివేదన చేసి, ఆ ప్రసాదాన్ని మాత్రమే భోజనం చేస్తాము. ఇది నిత్యం ఇంట్లో పాటించడం వల్ల, భావితరాల వారు కూడా అదే నేర్చుకుంటారు; ఆరోగ్యంగా ఉంటూ తరిస్తారు కూడా.
శరణు శరణార్థి!!!
అర్థం
కులమే ఎంచ వలసి వచ్చిన, జీవులకు హాని చేయువాడు మాదిగ. ఇతర జీవుల మాంసమును భక్షించు వాడు అంటరానివాడు. అంతే తప్ప ఇక వేరే కులమే లేదు. శివుని విభూతులైన సకల జీవులను ప్రేమతో చూడాలి. అలాంటి పద్ధతి పాటించే శివ శరణులే ఉత్తమ కులవంతులు.
విశ్లేషణ
వీరశైవులు కులవివక్షను పాటించరని, శివ భక్తులందరిని ఒకే విధంగా ఆదరిస్తారని ఇది వరకు చర్చించుకున్నాము. ఇక్కడ జీవకారుణ్యమును బట్టి ఉచ్ఛనీచములను నిర్ణయించారు బసవన్న.
శివశరణులు పాటించే నియమాలలో అహింస, సర్వ భూతదయ చాలా ముఖ్యమైన విషయములు. "లింగం సర్వమయం జగత్" అని నమ్మడం వల్ల కేవలం ఉదర పోషణార్థమే కాకుండా బలి తర్పణాదులలో యోగ్యమని చేయబడుచున్న హింసను తుచ్ఛములని తిరస్కరించారు. ఎలాంటి విషయంలోనూ జీవహింస కూడదని నమ్మిన వారు వీరశైవులు. అందుకే యజ్ఞములో బలి, జీవహింస ఉంటాయని యజ్ఞాన్ని కూడా సమ్మతించరు. వీరి నిత్య జీవన విధానంలో యజ్ఞము నిషిద్ధము. ప్రాణులన్నీ ఆ శివుని సంతానమే అని దయతో చూసే వీరశైవులు దేనిని చంపరు.
అంతేగాక వీరశైవులు చాలా నిష్ఠ గలిగిన శాకాహారులు (vegetarians). అభక్ష్యభక్షణము, ఆపేయపానములు, అంటే భావిపాకములైన తిను పదార్థము, త్రాగు పానీయము ఏదైనా సరే వీరు ముట్టుకోరు. మాంసము, మద్యము,మాదక ద్రవ్యములు, పొగ వంటివన్నీ నిషిద్ధములు - ఎట్టి పరిస్థితులలోను వాటి జోలికి వీరశైవులు పోరాదు. జీవుని ఆధ్యాత్మిక ఉద్ధరణకు తీసుకునే అన్నము చాలా ముఖ్యము. తినే అన్నములోని సూక్ష్మభాగం బుద్ధికి శక్తినిస్తుందని శాస్త్రము చెబుతుంది. హింసతో కూడిన పదార్థము ఏదైనా దాని సూక్షము బుద్ధిపై ప్రభావము చూపుతుంది, తమో గుణాన్ని పెంచుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక బాటలో నడిచే వారు శాకాహారులుగా ఉండటం చాలా ముఖ్యం - వినా వేరే మార్గము లేదు. అహింసాధర్మాన్ని తమ కులశీలమని ఆజన్మాన్తము పాటిస్తారు వీరశైవులు. అందుకే శరణులే ఉత్తమ కులజులు.
ఈనాడు మనం ధర్మము శాస్త్రజ్ఞానము తెలియక నియమమును తప్పుతున్నాము. కొందరు వంశపారంపర్యంగా అహింస తప్పని తెలిసినా, మాంసాహారము/మద్యపానము నిషిద్ధమని తెలిసినా ఆ విషయాన్ని సదుపాయంకొరకో, జిహ్వచాపల్యంకొరకో విస్మరిస్తున్నారు. సమాజంలో ఇతరులతో కూడి ఉండాలంటే, వారితో వ్యాపారము చేయాలంటే ఇవి అవసరం అని వీళ్ళు చెప్పే సాకు. ఇంకొందరు శాకాహారంలో బలం ఉండదని పిల్లలకు చిన్నప్పటి నుంచే నీచమును తినిపిస్తున్నారు. ఇంకొందరు తాము నిష్ఠగా ఉన్నా తమ పిల్లలు చేస్తే, వారికి తప్పొప్పులు చెప్పకుండా, వారికి స్వీయనిర్ణయ స్వేచ్ఛ (freedom to decide) ఇస్తున్నామని చెప్పుకొని తమను తాము భ్రమ పెట్టుకుంటున్నారు. ఇటువంటి వ్యవహారంవల్ల ముందు తరాల వారికి వీరశైవులు శాకాహారులనే సంగతే తెలియదు. ఇక వారి జ్ఞానార్జన, తరించడం చాలా దూరపు మాట. మీ పిల్లలు తామసిక ఆహారములకు దూరంగా బ్రతకడం వీరశైవ సమాజంలో పుట్టడంవల్ల వారికి కలిగే అదృష్టం. శరణ మార్గంలో జీవించడం వారికి జన్మతారా సంక్రమించిన హక్కు. దాన్ని వారికి తెలియకుండానే వారికి దూరంచేసే అధికారం మీకు ఎవరిచ్చారు?
వీరశైవము సంపూర్ణంగా ఆధ్యాత్మిక మార్గము; దీనికి శివజ్ఞానము, శివజీవైక్యము తప్ప వేరే ధ్యేయమే లేదు. మరి అటువంటి వారికి అన్నము యొక్క సంస్కారము ఎంత ముఖ్యమో మీరే ఊహించండి!! వీరశైవులు పాటించే సదాచారంలో శీలవంతులవడం ముఖ్యము. ఇందులో ఐదవ శీలమైన "సంబంధ శీలము" కోసము శివమార్గములో భావిపాకములైన తామసాహారములు విడువవలెనని నిర్ణయించబడి ఉన్నది.
మరి "ఎటువంటి ఆహారం తీసుకోవాలి?" అనే ప్రశ్న తలెత్త వచ్చు. దీనికి ఒకే కొలబద్దను నిర్ణయించింది మనధర్మము. అదే "ప్రసాదము". వీరశైవులు ఏది తిన్నా శివునికి నివేదించి తినడం అలవాటు చేసుకోవాలి; శివనివేదనం కానిదేదైనా సరే స్వీకరించకూడదు. దీనివల్ల తినే పదార్థము సంస్కరించబడుతుంది. అంతే గాక, శివునికి నివేదించాలి గనుక ఏదిబడితే అది తినే అవకాశం ఉండదు; కేవలం సాత్విక పదార్థం మాత్రమే నివేదన చేసి, ఆ ప్రసాదాన్ని మాత్రమే భోజనం చేస్తాము. ఇది నిత్యం ఇంట్లో పాటించడం వల్ల, భావితరాల వారు కూడా అదే నేర్చుకుంటారు; ఆరోగ్యంగా ఉంటూ తరిస్తారు కూడా.
శరణు శరణార్థి!!!
Good work
ReplyDeleteThank you. Appreciate the interest and encouragement. Regards
DeleteVery good. Vishleshana is too good. Thanks for awakening us. I would like to follow. If you give the meanings of vachnas in English also it would be more accessible.
ReplyDeleteVery good. Vishleshana is too good. Thanks for awakening us. I would like to follow. If you give the meanings of vachnas in English also it would be more accessible.
ReplyDeleteThanks Peddamma. Moving forward, I will try to include my analysis in English as well. I was catering to the telugu audience so far.
Delete